గీతా మందిరం పదవ వార్షికోత్సవం.. నగర సంకీర్తన నిర్వహించిన భక్తులు..
ప్రకాశం జిల్లా, సింగరాయకొండ లోని కళ్యాణ మండపం బజారులో ఉన్న గీతా మందిరం పదవ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా శుక్రవారం నాడు ఉదయం 5 గంటలకు నగర సంకీర్తన నిర్వహించారు. తదనంతరం గీతా మందిరంలో స్వామివారికి పాలాభిషేకం - సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు భక్తిశ్రద్ధలతో నగర సంకీర్తన చేసి అభిషేకాల లో పాల్గొని పులకరించిపోయారు . తదనంతరం వేద పండితులు అందరికీ తీర్థప్రసాదాలు ఇచ్చి శుభం కలగాలని ఆకాంక్షించారు.
What's Your Reaction?
Like
4
Dislike
0
Love
1
Funny
0
Angry
1
Sad
0
Wow
1