విద్యార్థులు, యువకులు జీవితాలను నాశనం చేసుకోవద్దు.. డివైఎఫ్ఐ యాంటీ డ్రగ్స్ జన చైతన్య జీబు యాత్ర

Apr 8, 2026 - 13:02
 0  6
విద్యార్థులు యువకులు మత్తు పదార్థాలకు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి
1 / 1

విద్యార్థులు యువకులు మత్తు పదార్థాలకు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి

 డివైఎఫ్ఐ యాంటీ డ్రగ్స్ జన చైతన్య జీపు యాత్ర బుధవారం నాడు సింగరాయకొండకు చేరుకుంది .ఈ సందర్భంగా జిల్లా అయిద్వ కార్యదర్శి కే రమాదేవి మాట్లాడుతూ విద్యార్థులు, యువకులు మత్తు పదార్థాలకు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, విద్యార్థులు యువకులు తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని గంజాయి లేని సమాజాన్ని నిర్మించడం కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు కెవి పిచ్చయ్య, యాంటీ డ్రగ్స్ ఫోరం బాలల సంఘం నాయకులు సిహెచ్ వినోద్ , ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వీరస్వామి ,ఆకాష్ ,ప్రశాంత్ ,విజయ్ ,సుజాత, నవీన్ తదితరులు పాల్గొన్నారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0