గోపి మెమోరియల్ క్రికెట్ విజేతలు ఎస్.కె సి సి
ఫైనల్ ఫైట్లో ఎస్.కె సి సి దుమ్మురేపింది
సింగరాయకొండ ప్రభుత్వ జూనియర్ కాలేజీ మైదానంలో నిర్వహించిన గోపి మెమోరియల్ రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలు ఉత్సాహభరితంగా ముగిశాయి.
ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్లో ఎస్కే సీసీ మరియు అన్వర్ లెవన్స్ జట్ల మధ్య జరిగిన పోటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో ఎస్కే సీసీ జట్టు అద్భుత ప్రదర్శన కనబరచి విజేతగా నిలిచింది.
విజేత జట్టుకు రూ.50 వేల నగదు బహుమతిని సిఐ శ్రీహరి అందజేశారు. రెండో మరియు మూడో స్థానాల్లో నిలిచిన జట్లకు వరుసగా రూ.30 వేల మరియు రూ.20 వేల నగదు బహుమతులు ప్రదానం చేశారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు బ్రహ్మయ్య, టౌన్ అధ్యక్షులు యధాని, టిడిపి సీనియర్ నాయకులు సుబ్బారావు, చంటి, నరసింహ, రవి, శేషు, అంకమ్మరావు పాల్గొన్నారు. గీతం స్కూల్ చైర్మన్ లక్ష్మణ్ ప్రత్యేక అతిథిగా హాజరై విజేతలకు అభినందనలు తెలిపారు.
పోటీల అనంతరం ట్రోఫీతో విజేత జట్టు సభ్యులు, అతిథులు కలిసి సంబరాలు జరుపుకున్నారు. యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించేందుకు ఇలాంటి పోటీలు ఎంతో అవసరమని నిర్వాహకులు పేర్కొన్నారు.

What's Your Reaction?
Like
2
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0