"అల్లూరి సీతారామరాజు త్యాగం చరిత్ర కాదు... ప్రతి భారతీయుడికి స్ఫూర్తి...మంత్రి స్వామి

Jul 4, 2026 - 13:08
 0  4
దేశం కోసం జీవించిన మహనీయులను గుర్తుంచుకోవడం... దేశభక్తికి తొలి అడుగు." 🇮🇳
1 / 1

దేశం కోసం జీవించిన మహనీయులను గుర్తుంచుకోవడం... దేశభక్తికి తొలి అడుగు." 🇮🇳

అల్లూరి సీతారామరాజుకు ఘన నివాళులు అర్పించిన మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి ఒంగోలు, జూలై 4 (కేవీఎస్ న్యూస్): ప్రకాశం జిల్లా ఒంగోలులో శనివారం నిర్వహించిన విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, అల్లూరి సీతారామరాజు భారత స్వాతంత్ర్య సమర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన మహనీయుడని అన్నారు. బ్రిటిష్ పాలకుల దమనకాండకు వ్యతిరేకంగా గిరిజనులను ఏకం చేసి పోరాడిన ఆయన ధైర్యసాహసాలు ప్రతి భారతీయుడికి ఆదర్శమని పేర్కొన్నారు. దేశం కోసం తన ప్రాణాలను సైతం త్యాగం చేసిన అల్లూరి సేవలను ఎప్పటికీ మరువలేమన్నారు. నేటి యువత అల్లూరి సీతారామరాజు ఆశయాలను ఆదర్శంగా తీసుకుని దేశభక్తి, సేవాభావం, క్రమశిక్షణతో ముందుకు సాగాలని మంత్రి పిలుపునిచ్చారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాల ఫలితంగానే మనకు స్వేచ్ఛ లభించిందని, వారి స్ఫూర్తిని భావితరాలకు చేరవేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులతో కలిసి అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. కార్యక్రమం దేశభక్తి నినాదాలు, అల్లూరి స్ఫూర్తిని చాటే సందేశాలతో ఘనంగా కొనసాగింది.

What's Your Reaction?

Like Like 1
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0