మతి స్థిమితం లేని మహిళను ఆమె తల్లి తండ్రుల దగ్గరకు చేర్చిన సింగరాయకొండ పోలీసులు

మతి స్థిమితం లేని మహిళను కుటుంబ సభ్యులకు చేర్చిన సింగరాయకొండ పోలీసులు సింగరాయకొండ పోలీసుల మానవత్వానికి నిదర్శనంగా నిలిచే ఘటనలో, మతి స్థిమితం లేని ఓ మహిళను ఆమె కుటుంబ సభ్యులకు సురక్షితంగా అప్పగించారు. ఈ నెల 15వ తేదీ తెల్లవారుజామున సుమారు 3 గంటల సమయంలో ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన అంచలదేవి బంజారే (25) అనే మహిళ జాతీయ రహదారి NH-16 పై కలికివాయి ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద నెల్లూరు వైపు నడుచుకుంటూ వెళ్తుండగా 112 ద్వారా సింగరాయకొండ పోలీసులకు సమాచారం అందింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని మహిళను విచారించారు. అయితే ఆమె మతి స్థిమితం సరిగా లేకపోవడంతో సరైన వివరాలు చెప్పలేకపోయింది. దీంతో సింగరాయకొండ సీఐ ఆదేశాల మేరకు ఆమెకు ప్రథమ చికిత్స అందించి, భద్రత నిమిత్తం ఒంగోలు సఖి వన్ స్టాప్ సెంటర్కు తరలించారు. తరువాత మహిళ వద్ద ఉన్న ఆధార్ కార్డు ఆధారంగా ఆమె కుటుంబ సభ్యుల వివరాలను గుర్తించిన పోలీసులు, ఛత్తీస్గఢ్లో ఉన్న ఆమె తల్లి మరియు బంధువులకు సమాచారం అందించారు. దీంతో ఈ నెల 19వ తేదీన మహిళ తల్లి కెవరా బాయికథా మరియు కుటుంబ సభ్యులు ఒంగోలు సఖి సెంటర్కు చేరుకుని, ఆమెను తమ కుమార్తె అంచలదేవిగా గుర్తించారు. అనంతరం అవసరమైన ధృవీకరణ ప్రక్రియ పూర్తి చేసిన తర్వాత సఖి వన్ స్టాప్ సెంటర్ సిబ్బంది సమక్షంలో మహిళను ఆమె తల్లికి అప్పగించారు. ఈ సందర్భంగా మహిళను సురక్షితంగా కుటుంబ సభ్యులకు చేర్చిన సింగరాయకొండ పోలీసుల సేవాభావాన్ని స్థానికులు అభినందించారు.
What's Your Reaction?
Like
1
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0